Wednesday, May 15, 2024

నేడు కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన

ఎల్లారెడ్డి/కామారెడ్డి, l: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ సోమవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జీవధాన్‌ స్కూల్‌ ప్రాంగణంలో 35 వేల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి రానుండటంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గంపగోవర్ధన్‌, జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు.

ఉదయం 11 గంటల నుంచి 11.40 గంటల వరకు కామారెడ్డిలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు

.మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 గంటల వరకు ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

- Advertisement -

మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి రోడ్డుపై ఉన్న జీవధాన్‌ సమీపంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు

ఈమధ్యాహ్నం 3 గంటలకు నాగిరెడ్డిపేట మండలంలో భోజనం చేస్తారు.మధ్యాహ్నం 3.30 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement