Sunday, April 28, 2024

AP : వైభవంగా ఆదిదంపతుల గిరిప్రదక్షిణ

(ఎన్టీఆర్ జిల్లా బ్యూరో, ప్రభన్యూస్) : పౌర్ణమి వేళ..లోకకళ్యాణార్థం, భక్త జన శ్రేయస్సు కోసం సోమవారం ఇంద్రకీలాద్రిపై వేంచేసిన ఆదిదంపతుల గిరిప్రదక్షిణ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చరణలు, సు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను ఆలయం(ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో తెల్లవారుజామున .05.55 గంటలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆలయ అధికారులు కొబ్బరి కాయ కొట్టి ఆదిదంపతుల గిరిప్రదక్షిణను ప్రారంభించారు.

ఈ గిరిప్రదక్షిణ శ్రీ కామధేను ఆలయం నుంచి కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యాలతో సాగింది. గిరిప్రదక్షిణ మార్గంలో ప్రచార రథంలో కొలువైన ఆదిదంపతులకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు సమర్పించి భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement