Saturday, May 4, 2024

సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఇవ్వండి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ డిమాండ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: అర్హత కలిగిన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్‌ అజయ్‌ జైన్‌ను గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ కోరింది. ఈమేరకు మంగళవారం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రోబేషన్‌ డిక్లేర్‌ చేసి నూతన పేస్కేల్‌ తో జీతాలు అందించినందుకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప‌లువురు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు అందజేశామన్నారు. ఇందులో సీబీఎస్‌ఈ సిలబస్‌ చదివిన వారికి లాంగ్వేజ్‌ టెస్ట్‌తో సంభందం లేకుండా ప్రోబేషన్‌ డిక్లేర్‌ చేయాలని కోరటం జరిగిందన్నారు.

అలాగే, బదిలీలకు అవకాశం కల్పించాలని, ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరిన‌ట్టు తెలిపారు. వీటిపై స్పందించిన స్పెష‌ల్‌ సీఎస్‌ సానుకూల దృక్పథాన్ని వ్యక్తపర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయాల శాఖను జాతీయ స్థాయిలో తిరుగులేని విధంగా ఉంచేలా పనిచేయాలని అజయ్‌ జైన్‌ కోరినట్లు తెలిపారు. అలాగే, ప్రోబేషన్‌ డిక్లరేషన్‌ పూర్తి చేసుకొని నూతన పేస్కేల్స్‌ తీసుకున్న సచివాలయ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారన్నారు. కార్యక్రమంలో ప‌లువురు ఫెడ‌రేష‌న్ లీడ‌ర్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement