Monday, April 29, 2024

AP: గ్యాస్‌లోడ్‌ లారీ, బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి

గ్యాస్ లోడ్ లారీ బైక్ ను ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ మధురవాడ బొరవానిపాలెం జాతీయ రహదారిపై గ్యాస్‌ లోడ్‌ లారీ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెదవాల్తేరు వాసులు మణి, నిరంజన్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement