Monday, May 6, 2024

గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మం.. బైక్ పై డిప్యూటీ సీఎం

దేవరాపల్లి..మారుమూలన ఉన్న యావన్మందికి సంక్షేమ పధకాలు అందిస్తున్న ప్రభుత్వం మనదని …డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. వేచలం పంచాయతీ పరిధిలోని ముత్యమాంబ, సర్పంచ్, కర్రోరి, నాయుడు వారి, అచ్చన్న, కత్తన్న వారి, బండిడి, రెండుగుళ్ళు, ఆరుండి, గొల్లోళి, వంటాకుల కల్లాలలో రెండవ రోజు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు పంచాయతీరాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు. ద్విచక్ర వాహనంపై వెళ్లి అన్ని కల్లాలలో నివాసం ఉంటున్న అందరి ప్రజలను పలకరించారు మంత్రి. కల్లాలలో నివాసముంటున్న వారి నివాసాలకు వెళ్లి అందిస్తున్న సంక్షేమ పధకాల అమలు పై అరా, వారికీ కావాల్సిన మంచిని నీటి, విధ్యుత్ , రోడ్డు సదుపాయాలు కల్పనకు అధికారులను ఆదేశించారు డిప్యూటీ సియం.

జగన్నాధపురం కాలువపై స్లబ్ కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలనీ అధికారులకు సూచన చేశారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరించారు డిప్యూటీ సియం. గ్రామానికి రూ. 20 లక్షల రూపాయలతో శాశ్వత వనరుల సంకల్పన, సమస్యల పరిష్కారని నిధులు మంజూరు చేశారు. కల్లాలలో నీటి అవసరాల నిమిత్తం మరో 20 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికీ ప్రతిపాదనలు సిద్దం చేయాలనీ అధికారులను ఆదేశించారు మంత్రి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు లబ్ధిదారులు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రీ సత్యం, వైసీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ బూరె బాబురావు, ఎంపీడీవో సుబ్బాలక్ష్మి, గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి శఠరి నాయుడు, మండల గ్రామ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement