Saturday, May 4, 2024

చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ‍ … న‌లుగురు దుర్మ‌ర‌ణం..

చిత్తూరు సెప్టెంబర్ 15 ప్రభ న్యూస్ బ్యూరో – చిత్తూరు సమీపంలోని తెల్లగుండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. సంఘటనా స్థలాన్ని వెస్ట్ సి ఐ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం
ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో బెంగళూరు నుండి ఒంగోలుకు వెళ్తున్న ఆయిల్ టాంకర్ రోడ్డు వైపు నిలబెట్టి ఉండగా బెంగళూరు లోని విక్టోరియా ఆసుపత్రి నుండి నుంచి ఒరిస్సా కు వెళ్తున్న అంబులెన్స్ ఆయిల్ ట్యాంకర్ ను వెనక నుండి ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని, నలుగురికి తీవ్ర గాయాలైనట్టు సి ఐ తెలిపారు .


ఈ ప్రమాదంలో మంజులత, త్రిలోచనా, ఉమేష్ చంద్ర, విజయ్ మృతి చెందారని, జతిన్.. దేబ భ్రత , అంబులెన్స్ డ్రైవర్ సంజయ్.. లారీ డ్రైవర్ శంకర్ లకు తీవ్ర గాయాలు అయినట్టు తెలిపారు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. యాదమరి ఎస్సై సుమన్ , కాణిపాకం ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను ప్రభుత్వాసుపత్రి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement