Sunday, May 5, 2024

పాడేరు లోయలో పడ్డ ఆర్టీసీ బ‌స్సు – న‌లుగురు దుర్మ‌ర‌ణం

అల్లూరి జిల్లా… పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద 100 అడుగుల లోయలో నుండి ఆర్టీసీ బస్సు ప‌డిపోయింది.. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు మ‌ర‌ణించారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు..

పాడేరు నుండి చోడవరంకు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సులో 60 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు.. ప్ర‌మాద వార్త తెలిసిన వెంట‌నే స‌హాయ బృందాలు అక్క‌డికి చేరుకున్నాయి. గాయ‌ప‌డిన వారిని అంబులెన్స్ ల‌లో పాడేరు హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లిస్తున్నారు.. ప‌లువురికి తీవ్ర గాయాలు కావ‌డంతో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని భ‌య‌ప‌డుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement