Sunday, April 28, 2024

Breaking: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ఆటో ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. జిల్లాలోని పెద్దారవీడు మండలం దేవరాజు ఘట్టు దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

కారు, ఆటో ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు మాబు, అభినయ్‌(10), వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement