Thursday, May 2, 2024

బ్రిడ్జిపై వ‌ర‌ద‌నీరు : గుడ్లూరు-కందుకూరుల మధ్య నిలిచిన రాకపోకలు

గుడ్లూరు, (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని మన్నేరు మాచవరం సమీపంలో ఉన్న బ్రిడ్జి పైన, పురేటిపల్లి బ్రిడ్జ్ పైన సుమారు రెండు అడుగుల నీరు ప్రవహిస్తుంది. దీంతో మండల కేంద్రం గుడ్లూరు నుండి కందుకూరుకు పురేటిపల్లి నుండి కందుకూరుకు రవాణా పూర్తిగా స్తంభించింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు తోడు రాళ్లపాడు రిజర్వాయర్ పైభాగంలో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ 5గేట్లను ఎత్తి సుమారు 48,000ల క్యూసెక్కుల నీటిని మన్నేటికి విడుదల చేసారు. దీంతో ఎటువంటి అవాంతరాలు జరగకుండా సోమవారం అర్ధరాత్రి నుంచి కందుకూరు ఎస్డీపీఓ కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్.ఐ ఆర్.మల్లికార్జున ముందస్తుగా తమ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement