Sunday, May 5, 2024

స్కార్పియో బోల్తా.. ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలు

స్కార్పియో వాహనం బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని విడపనకల్లు మండలం కొట్టాలపల్లి వద్ద 42వ జాతీయ రహదారిలో టైర్ పంక్చర్ కావడంతో స్కార్పియో బోల్తా పడిన ప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారికి చెందిన 9 మంది వజ్రకరూరులో వివాహానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బళ్ళారికి చెందిన ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం బళ్ళారికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement