Sunday, May 5, 2024

Fire Brand Warns – పిచ్చిగా మాట్లాడితే ప‌ళ్లు రాల‌తాయి – ప‌వ‌న్ కు రోజా వార్నింగ్

గుంటూరు: సీఎం జగన్‌ పాలన చూసి ఓర్వలేక.. ఓటమి భయంతోనే దత్తపుత్రుడితో చంద్రబాబు నాయుడు విషం చిమ్మిస్తున్నాడని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్లను ఉద్దేశించి జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు. వాలంటీర్లు ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారని పవన్‌ అనడం దుర్మార్గమ‌ని అన్నారు. . మిస్సింగ్‌కు అక్రమ రవాణాకు తేడా తెలుసా?. అంటూ ప్ర‌శ్నించారు.. అసలు వార్డు మెంబర్‌గా గెలవని పవన్‌కు అసలు రిపోర్ట్‌ ఎవరిచ్చారు?.. నిఘా వర్గాలు ఇచ్చాయా? అని అడిగారు.. చంద్రబాబు గతంలో వలంటీర్ వ్యవస్థ పై నోటికొచ్చినట్టు మాట్లాడారని, . ఇప్పుడు దత్త పుత్రుడు విషం చిమ్ముతున్నాడ‌న్నారు… వలంటీర్ వ్యవస్థ నడ్డి విరచడం కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేర‌ని పవన్‌పై మండిపడ్డారు. దమ్ముంటే ఒకటో తేదీన వస్తే.. వాలంటీర్లు ఎలాంటి వాళ్లో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. కోవిడ్ సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని.. ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేశారామె. అలాంటి వాలంటీర్లపై పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారని అని హెచ్చరించారు మంత్రి రోజా.

ఇదిఇలా ఉంటే ఇంతకాలం సీఎం జగన్‌ అంటేనే పవన్‌కు వణుకు అనుకున్నా. కానీ, వాలంటీర్లను చూసి కూడా వణికిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. మహిళల మిస్సింగ్‌ కేసుల్లో టాప్‌ టెన్‌లో ఏపీ లేనే లేద‌ని, ఆ లిస్ట్‌లో తెలంగాణ 6వ స్థానంలో ఉంద‌ని,. మరి ఆ రాష్ట్రం గురించి మాట్లాడ‌రంటూ పవన్ కల్యాణ్‌ను నిలదీశారామె. కేసీఆర్‌కు భయపడే మాట్లాడలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. ద‌మ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల‌లో ఒంటరిగా పోటీ చేసి గెల‌వాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement