Friday, April 26, 2024

విద్యుత్ షాక్ తో.. తండ్రి, కొడుకు మృతి

విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్‌ షాక్‌తో తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటన వారి కుటుంబంలో తీరని దుఃఖం నింపింది. నగల వ్యాపారి నవర నానాజీ, అతడి కుమారుడు మౌలేశ్‌ ఇంటిలో విద్యుత్‌ మరమ్మతులు పనిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మౌలేశ్‌ దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement