Thursday, May 9, 2024

రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొటున్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణకు ముంద‌స్తు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు లక్ష్మీనారాయణను 15 రోజుల పాటు అరెస్టు చేయవద్దని ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. గత శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో ఈరోజు ఆయనను సీఐడీ తమ ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ల‌క్ష్మీనారాయ‌ణ ఈరోజు సీఐడీ అధికారుల ముందు హజరుకావల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement