Sunday, April 28, 2024

Engagement – మేనల్లుడు నిశ్చితార్ధ వేడుకకు హాజరైన జగన్… తల్లి, సోదరితో పలకరింతలు

హైదరాబాద్ – ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు , సోదరి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధ వేడుకకు సీఎం వైఎస్ జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులు రాజారెడ్డి, ప్రియ అట్లూరిలను జగన్ దంపతులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన చెల్లెలు షర్మిల, బావ బ్రదర్ అనిల్‌లను ఆయన పలకరించారు తల్లి విజయమ్మతో కొంత సేపు ముచ్చటించారు.

హైదరాబాద్ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం అట్లూరి ప్రియతో జరిగింది. రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకున్న ప్రియ.. అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయమై ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాజారెడ్డి, ప్రియల వివాహం జరగనుంది నిర్వహిస్తున్నట్లుగా షర్మిల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement