Friday, May 17, 2024

నరసన్న ఆలయ అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష ..

తూర్పుగోదావ‌రి : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంతర్వేది పర్యటనలో ప్రకటించిన రూ. 13కోట్ల అభివృద్ధి పనులపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమలాపురం ఆర్ డి ఓ అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.ఆలయ పరిసర ప్రాంతంలో సుమారు 5అడుగులు ..చ‌దును చేసేందుకు అధికారులు పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి పేషీ కి పంపనున్నారు.ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్ డి ఓ వసంత రాయుడు,దేవాదాయ శాఖ ఉపకమీషనరు మేడేపల్లి విజయరాజు,డ్వామా పి.డి,ఈ.ఈ పంచాయితీరాజ్, దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు, దేవస్థానం ఏసీ , ఈఓ బద్రాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement