Friday, April 26, 2024

కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు క‌న్నుమూత‌…‌‌

రాజమండ్రి: కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు(72) మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1984లో జడ్పీ చైర్మన్‌గా టీడీపీ తరపున రామారావు సేవలందించారు. అలాగే 1994, 2004లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012-17 వరకు ఎమ్మెల్సీగా బొడ్డు భాస్కర రామారావు పనిచేశారు. బొడ్డు భాస్కర రామారావు స్వగ్రామం పెదపూడి మండలం పెద్దాడ. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement