Tuesday, April 30, 2024

గొర్రెపిల్లలపై కుక్కల దాడి, 28 పిల్లలు మృతి.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవ‌ర్గం సంతబొమ్మాళి మండల కేంద్రంలో దారుణం జరిగింది. కుక్కలు దాడిచేయడంతో 28 గొర్రె పిల్లలు శుక్రవారం రాత్రి చనిపోయాయి. గండమన అప్పయ్య కు చెందిన ఈ గొర్రెపిల్లలు చనిపోవడంతో సంరక్షకులు లబోదిబో మంటున్నారు. పెద్ద కొండ వద్ద ఉన్న గొర్రెలపాకలో పిల్లలను ఉంచి ఉదయం మిగతా వాటిని మేతకు తీసుకువెళ్లినట్టు కాపరులు తెలిపారు. కాగా, రాత్రి తిరిగి వచ్చేసరికి పిల్లలన్ని చనిపోయాయని అప్పన్న కన్నీరుమున్నీరుగా విలపించాడు. కుక్కలు దాడితో గొర్రె పిల్లలు చనిపోవడంతో తనకు దాదాపు 2లక్షలు వరకు నష్టం వాటిళ్లిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement