Tuesday, May 21, 2024

Breaking: రోడ్డు ప్ర‌మాదంలో బ్యాంకు మేనేజ‌ర్ మృతి.. డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్తుండ‌గా ఘ‌ట‌న‌

అబ్దుల్లాపూర్ మెట్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని కొటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజర్ చ‌నిపోయాడు. ఈ ఘటన హైద‌రాబాద్‌లోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేష‌న్ పరిధిలో ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి జ‌రిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన నల్లెంకి శ్రీను (32) వనస్థలిపురంలోని కొటక్ మహీంద్రా బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ గా ప‌నిచేస్తున్నాడు.

రోజూ ఇంటి నుండి విధులకు హాజరై తిరిగి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో శుక్రవారం ఇంటికి వెళ్తుండ‌గా అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ కమాన్ (జాతీయ రహదారి 65) వద్ద అతని బైక్‌ని ఎదో గుర్తు తెలియ‌ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బైక్ పక్కనే పడిపోవ‌డంతో అత‌ని తలకు తీవ్రమైన గాయాల‌య్యాయి. దీంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. శ్రీనుకు ఆరు నెలల క్రితం పెళ్లి అయ్యింది. అత‌ని మృతికి గ‌ల కార‌ణాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తాయని బంధువులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement