Sunday, April 28, 2024

Dhone – రైల్వేఅండ‌ర్ బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు బుగ్గ‌న భూమి పూజ‌..

ఉమ్మడి జిల్లా కర్నూలు – డోన్ పట్టణంలో రూ.12 కోట్లతో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ నిర్వహించారు.. అలాగే . డోన్ లో రూ.5.5 కోట్లతో నిర్మించిన కొత్త పురపాలక పరిపాలన భవనాన్ని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో క‌ల‌సి బుగ్గ‌న‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌, డైరెక్టర్ పి.కోటేశ్వరరావు, నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్, ఆర్డీవో వెంకట రెడ్డి, ఎమ్మార్వో విద్యాసాగర్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement