Sunday, May 5, 2024

ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు..

టీడీపీ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు ఏపీ దేవాదాయశాఖ నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు స్వభావం తెలపాలంటూ నోటీసులో పేర్కొంది దేవాదాయ శాఖ. ట్రస్టు వార్షిక ఆదాయం, వివరాలు సమర్పించాలని నోటీసులో తెలిపింది దేవాదాయశాఖ. ట్రస్టు డీడ్ , మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టు ఆస్తులు, ఇతర ట్రస్టుల వివరాలకు సంబంధించిన కాపీలు అందించాలని దేవాదాయ శాఖ పేర్కొన్నారు. FDRలు, ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు, గత మూడు సంవత్సరాల వార్షిక ఆదాయము, ఖర్చులకు సంబంధించిన వివరాలను పది రోజుల్లో సమర్పించాలని నోటీసులో వెల్లడించింది దేవాదాయశాఖ

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement