Friday, April 26, 2024

రైలు టాయిలెట్‌లో డెలివరీ, శిశువుని వదిలేసిన తల్లి.. ధన్​బాద్​ రైలులో ఘ‌ట‌న‌ (వీడియో)

విశాఖ రైల్వే స్టేషన్ ధన్‌బాద్-అల్లెపీ ఎక్స్‌ప్రెస్‌లోని టాయిలెట్‌లో వాష్ బేసిన్ లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యం కావడంతో రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించారు. బుదవారం ఉదయం రైలులో ఓ గుర్తు తెలియని మహిళ మగబిడ్డను ప్రసవించిన ఘ‌ట‌న జ‌రిగింది. రైలు నెం. 13351 ధన్‌బాద్-అల్లెపీ ఎక్స్‌ప్రెస్‌లోని టాయిలెట్‌లో వదిలివేసిన‌ట్టు అధికారులు గుర్తించారు. బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు సింహాచలం స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత రైలులోని ప్రయాణికులు శిశువు గురించి ఆన్‌బోర్డ్ టీటీ ఈ వి.బ్రహ్మాజీ తెలియ జేయడంతో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు.

సమాచారం అందుకున్న ఆర్‌పిఎఫ్ పోలీసులు రైలు వద్దకు చేరుకుని శిశువును విశాఖపట్నం డివిజనల్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన చికిత్స, సంరక్షణ నిమిత్తం కేజీహెచ్‌కు తరలించిన‌ట్టు రైల్వే అధికారులు తెలిపారు. తల్లి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిడ్డను సొంతం చేసుకుంటే వారి పెంపకానికి పూర్తి ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ వీడియో కోసం www.prabhanews.com ని క్లిక్​ చేయండి

Advertisement

తాజా వార్తలు

Advertisement