Monday, May 13, 2024

పంటపొలాల్లో బీటెక్ విద్యార్థి మృత‌దేహం లభ్యం..

పంట పొలాల్లో బీటెక్ విద్యార్థి డెడ్ బాడీ లభ్యమైన దారుణ ఘ‌ట‌న బెజ‌వాడ‌లో చోటుచేసుకుంది.. సుధాకర్ అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగులబెట్టిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. పేద పులిపాక పంటపొలాల్లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బెజవాడ మాచవరం ప్రాంతానికి చెందిన సుధాకర్ గా గుర్తించారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్న సుధాకర్… గ‌త‌ రాత్రి స్నేహితుడు శ్యాం పుట్టిన రోజు వేడుకల కోసం ఇంటి నుంచి వెళ్లాడు. బర్త్ డే పార్టీ మధ్య ఫోన్ రావటంతో వెళ్ళాడని చెబుతున్నారు స్నేహితులు. పెట్రోల్ పోసి తగులబెట్టి న ఆనవాళ్లు బట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement