Friday, May 3, 2024

సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కృష్ణా జలాల వివాదంపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని తెలంగాణ ఖాళీ చేస్తోందని, శ్రీశైలం డ్యాం ఖాళీ అయితే రాయలసీమకు చుక్కనీరు దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కేంద్రానికి లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఉండదని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్షాన్ని కలుపుకు వెళ్ళాలని రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement