Thursday, May 2, 2024

అంధ్రప్రదేశ్ ప్రత్యేక దేశమా?: సీపీఐ రామకృష్ణ

ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల అంబులెన్స్ లను ఆపడం వల్ల  కరోనా రోగులు చనిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కరోనా రోగుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న దాదాపు 100 అంబులెన్సులను తెలంగాణ పోలీసులు ఆపటం దుర్మార్గం అని పేర్కొన్నారు. నంద్యాల- కడపలకు చెందిన ఇద్దరు కరోనా రోగులు మరణించడం బాధాకరమన్నారు. తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కనీస మానవత్వం లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇది అత్యంత అమానవీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ భారత దేశంలో అంతర్భాగంగా ఉందా? లేక ప్రత్యేక దేశమా? అని  రామకృష్ణ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement