Sunday, May 12, 2024

Kurnool: కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యం

కర్నూలు జిల్లా ఆత్మకూరులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. ఆత్మకూరు పట్టణంలోని అమర్ అనే వ్యక్తికి వయస్సు 25 ఏళ్ల వ్యక్తి బాంబైలో సాఫ్ట్ వేర్ గా  ఉద్యోగిగా పని చేస్తున్నాడు.  డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలకు ఆత్మకూరులోని బంధువులు ఇంటికి వచ్చాడు. అయితే, కరోనా లక్షణాలు ఉండడంతో ఈనెల 3న కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో అమర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు వైద్యాధికారులు సమాచారం అందింది. అయితే, ఇంతలోనే కరోనా బాధితుడు అదృశ్యం అయ్యాడు. బాధితుడి కోసం వైద్యాధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement