Thursday, May 2, 2024

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి…

మంగళగిరి క్రైమ్, మే 11, (ప్రభ న్యూస్): నార్త్ సబ్ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావు(45) రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు… నార్త్ సబ్ డివిజన్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు బుధవారం తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యలోని మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరు గణపతి నగర్ వీజే కళాశాల వద్ద కు వచ్చే క్రమంలో స్పీడు బ్రేకర్ దాటుతూ ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం శ్రీనివాసరావు మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు కలరు. కాగా శ్రీనివాసరావు 1996వ సంవత్సరంలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరి 2015 వ సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందాడు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆకస్మిక మృతిపట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement