Saturday, May 4, 2024

CM relief fund – లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ.10 లక్షల సాయం – సీఎం, ఎమ్మెల్యే లకు కృతజ్ఞతలు తెలిపిన శిరీష తల్లిదండ్రులు

శ్రీ సత్యసాయి బ్యూరో నవంబర్ 09: (ప్రభన్యూస్) శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం, బత్తినగారిపల్లి కి చెందిన సురేంద్ర, అక్కయ్య దంపతుల కుమార్తె శిరీష లివర్ సంబంధిత జబ్బుతో బాధపడుతూ కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి ని కలిసి వారి విన్నపాన్ని వినిపించుకోగా తక్షణమే ఎమ్మెల్యే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహాయ నిధి నుండి రూ. 10 లక్షలు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కొరకు మంజూరు చేయించడం జరిగింది.

వారి పేదరిక పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే మొన్నటి దినం శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కేంద్రానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని చిన్నారి తల్లిదండ్రులతో కల్పించి చిన్నారి వైద్య ఖర్చులకు అయ్యేటువంటి రూ. 7.50 లక్షల రూపాయలను మరో మారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయించినందుకు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి ని శిరీష తల్లిదండ్రులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎమ్మెల్యే ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement