Saturday, May 4, 2024

ఎమ్యెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా..

వైసీపీ ఎమ్యెల్యే రోజాకు సీఎం కెసిఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ ఆమేను పరామర్శించారు. త్వరగా ఎమ్యెల్యే రోజా కొలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో సీఎం కెసిఆర్. రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమలను తెలుసుకున్నారు. నెల రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సర్జరీలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చెన్నైలోని తన నివాసంలో రోజా విశ్రాంతి తీసుకుంటున్నారు. సీఎం కెసిఆర్ ఫోన్ చేయడంపై ఎమ్యెల్యే రోజా ఆనందం వ్యక్తి చేశారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్‌ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement