Saturday, May 11, 2024

AP | జ‌గ‌న్ ఒంటిమిట్ట ప్రోగ్రాం క్యాన్సిల్‌.. కార‌ణ‌మేంటంటే!

ఏపీ సీఎం జగన్‌మోహ‌న్‌రెడ్డి రేపు కడప జిల్లాలోని ఒంటిమిట్ట వెళ్లాల్సి ఉంది. అయితే.. కాలికి గాయం కార‌ణంగా ఒంటిమిట్ట పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) ఉదయం వ్యాయామం చేస్తుండగా జ‌గ‌న్ కాలు బెణికింది. నొప్పి ఎంతకీ తగ్గకపోగా, సాయంత్రానికి అధికమైంది. దీంతో డాక్టర్లు రెస్ట్‌ తీసుకోవాలని సూచించడంతో రేపు ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకున్నారు.

ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 5న సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున శ్రీ‌రాముడి పట్టువస్త్రాలు సమర్పించాలని భావించారు. అధికారులు కూడా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కాలు బెణకడంతో ఈ పర్యటన రద్దు అయిన‌ట్టు అక్క‌డి ఆల‌య అధికారుల‌కు స‌మాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement