Saturday, May 4, 2024

AP | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జ‌గ‌న్

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రపంచంలోని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని అ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటు-ంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ వారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని సీఎం జగన్మోహన రెడ్డి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement