Monday, April 29, 2024

Breaking: రేపు పల్నాడులో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేట ఏర్పడిన తర్వాత సీఎం పర్యటించడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేస్తారు. 11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం  12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement