Sunday, April 28, 2024

India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. అయితే, తాజాగా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న వెయ్యి లోపు కేసులు నమోదు కాగా.. ఇవాళ కేసులు సంఖ్య పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1086 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దేశంలో 71 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో 1198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  4,30,30,925 కు చేరింది.ఇందులో 4,24,97,567 మంది బాధితులు కోరనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు   5,21,487 మంది బాధితులు మరణించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,85,04,11,56 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement