Monday, May 20, 2024

గ్రూప్స్ పోస్టుల భర్తీకి జగన్ గ్రీన్‌సిగ్నల్.. సంతోషం వ్య‌క్తం చేస్తున్న అభ్య‌ర్థులు

ఏపీలో జాబ్ క్యాలెండర్ పోస్టుల కంటే అధికంగా భర్తీ చేయ‌డానికి అనుమతించారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. దీంతో అదనంగా గ్రూప్ 1 , గ్రూప్ 2 పోస్టుల భర్తీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇట్లా 110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పోస్టులు భర్తీ కానున్న‌యా. గ్రూప్ 2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టుల భర్తీ చేయ‌నున్నారు. ఏపీ స‌ర్కారు వెలువ‌రించిన ఈ ప్ర‌క‌ట‌న‌తో అభ్య‌ర్థులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement