Sunday, April 28, 2024

రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం.. భూమన

తిరుపతి సిటీ, జులై 6 (ప్రభ న్యూస్): రానున్న ఎన్నికల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం అని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. స్థానిక 30వ డివిజన్, నెహ్రూ నగర్ లో గురువారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్నినిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి బృందానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గడప, గడపకు మన జగనన్న ప్రభుత్వం కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. జగనన్న చేసిన మంచి పనుల పట్ల ప్రజలంతా ఎంతో కృతజ్ఞత చూపుతున్నారంటే.. ఈ డివిజన్ అంతా కిక్కరిసిపోయే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి విచ్చేసి స్వాగతిస్తున్నారని భూమన అన్నారు. మళ్లీ జగనన్నకే ఓట్లు వేస్తామని బలంగా ప్రోత్సహిస్తూ, ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.

జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు పులకింతులవుతున్న ప్రజలకు… మరోవైపు ఈర్షతో రెచ్చిపోతున్న ప్రతిపక్షాలకి మధ్య వచ్చే ఎన్నికల్లో యుద్ధం జరగనుందన్నారు. జగన్ మోహన్ రెడ్డి మంచికి, చంద్రబాబు, అతనికి కాపు గాస్తున్న ప్రతిపక్షాల చెడుకి మధ్య జరుగుతున్న యుద్దంగా అభివర్ణించారు. ప్రజలు మంచిని కోరుకుంటారే తప్ప దుర్మార్గపు పాలన అందించిన చంద్రబాబును చెడును మాత్రం కోరుకోరని స్పష్టం చేశారు. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తమను ఆశీర్వదిస్తుండడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాస్తున్న ఛానళ్లలో, పత్రికల్లో ఎంత దుర్మార్గపు ప్రచారం చేసినా.. పేద ప్రజలు గుండెల్లో జగనన్నను ఎంతగా అక్కున చేర్చుకున్నారో చాలా స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఎంత గ్లోబల్స్ ప్రచారాలు చేసినా.. లేదంటే ఎన్ని రాతలురాసినా… జగన్ మోహన్ రెడ్డిని ఢీ కొట్టడం చంద్రబాబు నాయుడు ముఠాకు కలలోని మాటేనని భూమన ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement