Thursday, May 9, 2024

సంక్షేమ పథకాలే జగనన్న ప్రభుత్వాన్ని నిలబెడతాయ్ : ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి సిటీ : సంక్షేమ పథకాలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడతాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ఆరవ డివిజన్ పరిధిలోని అక్కారాంపల్లి ప్రాంతంలో ఆదివారం ఉదయం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలంతా తమను సాదరంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్నా ఆకాంక్ష అందరిలోనూ వ్యక్తమవు తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి తిరుపతిలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ను కళ్లామిట్ట ప్రాంత ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. కర్పూర హారతులు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నా యన్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇఛ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే ఓట్లు వేసి గెలిపించు కుంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి. ముద్ర నారాయణ కార్పొరేటర్లు ఎస్ కెకో ఆప్షన్ సభ్యులు శ్రీదేవి.పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement