Thursday, May 2, 2024

వెలుగులు నింపుతున్న సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : ప్రజల జీవితాల్లో జగనన్న సంక్షేమ పథకాలు వెలుగులు నింపుతున్నాయ‌ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శనివారం గిరిపురం నందు గడపగడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నాయని గుర్తు చేశారు. జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు భరోసా ఇస్తున్నారన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దిశ డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement