Saturday, April 27, 2024

పేద‌ల సంక్షేమ‌మే ప్రభుత్వ ల‌క్ష్యం : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : పేదల పక్షాన నిలబడేది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక 18వ వార్డు మారుతి నగర్ లో కార్పొరేటర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లని అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని గుర్తించి పరిష్కరించడానికి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సమస్యలు. రోడ్లు, డ్రైనేజీలు, ఇళ్ల పట్టా సమస్యలు ఇతర సమస్యలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు ప్రజాప్రతినిధులకు చెప్పకుంటారని, ఆ సమస్యలను పరిష్కరించి ప్రజలకు అండగా ఉండాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు, ప్రజల నుంచి ఏ విధమైన సమస్యలు తాను దృష్టికి తీసుకువస్తే వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement