Thursday, May 16, 2024

శ్రీనివాస సేతు మూడో దశ ప్రారంభం

తిరుపతి సిటీ, ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్): తిరుపతి నగరంలో శ్రీనివాస సేతు మూడో దశ పనులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుచానూరు మ్యాంగో మార్కెట్ నుండి రామానుజన్ సర్కిల్ ముందుగా రేణిగుంట రోడ్డు కళాంజలి వరకు శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రానికి వివిధ దేశాల నుంచి ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారని రోజుకు వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు శ్రీనివాస సేతు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం సరదాగా శాసనసభ్యులతో పాటు నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన్ అభినయ్ రెడ్డి, ఎస్.ఈ మోహన్, విశ్వ విద్యాసంస్థల అధినేత విశ్వనాథరెడ్డి, ట్రాఫిక్ డిఎస్పి వన్ కాటమరాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement