Saturday, May 4, 2024

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం-అభివృద్ది మార్పు చేసి చూపుతాం- రత్నప్రభ

.. చిత్తూరు జిల్లా సత్యవేడు బేరిశెట్టికళ్యాణ మండపంలో బీజేపి యంపి అభ్యర్ధి కె.రత్నప్రభ కార్యకర్తలు ,స్థానిక నాయకులతో సమావేశం అయ్యారు.బీజేపి పార్టీ మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో సత్యవేడుకు వస్తుంటే అర్థమైందనీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అభివృద్ధి చేసి చూపుతా అని ఆమె ప్రమాణం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 73 సం”లు అయినా ఇప్పటికి సత్యవేడు‌నియోజకవర్గం వెనుకబడి ఉండటం దురదృష్టకరమని అన్నారు.బీజేపి ,జనసేన నాయకులను ప్రఛారానికి రానివ్వకుండా అడ్డుకుంటున్న వైకాపా నాయకులకు తగిన విధంగా బుద్ధి చెపుతామన్నారు.ఎక్కడైతే అడ్డుకున్నారో అక్కడనుంచే ప్రఛారాన్ని మొదలుపెట్టి ప్రజల్లో వెలుతామని ఆమె ఛాలేంజ్ చేశారు.దేశానికి తలమానికంగా ఉన్న శ్రీసిటీ ఇక్కడ ఉన్నప్పటికి స్థానికులకు ఉద్యోగ కల్పనలో అన్యాయం జరుగుతుందన్నారు.ఇక్కడి రైతుల నుండి భూములు తీసుకున్న తరుణంలో తాను ఒక అధికారిణిగా ఉన్నానని ,అప్పటి ఒప్పధం ప్రకారం స్థానికులకు న్యాయం జరిగేలా చేస్తానని పేర్కోన్నారు.ప్రజలు అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే కేంద్రంలోని 54 శాఖల ద్వారా నిధులు సమకూర్చి సత్యవేడు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంలా మారుస్తానని హామి ఇచ్చారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, శాంతారెడ్డి, ఆదినారాయణరెడ్డి ,చిలకం రామచంద్రారెడ్డి ,దయాకర్ రెడ్డి ,నియోజకవర్గ సమన్వయ కర్త చింతల సెల్వం ,పురుషోత్తం నాయకులు ,కార్యకర్తలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement