Wednesday, May 1, 2024

ఏపీకి నాలుగు రోజుల పాటు వర్ష సూచన

విశాఖపట్నం -. మండుటెండలతో బెంబేలెత్తుతున్న ఏపీకి కొంత ఉపశమనం కలగనుంది. వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవ నున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖ,ఉభయగోదావరి జిల్లాలు,ఉత్తరాంద్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement