Tuesday, April 30, 2024

సైకో వీరంగం.. సైకోను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అన్నమయ్య జిల్లా, రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని మదనపల్లి రహదారిలో వున్న హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం రాత్రి కత్తులతో సైకో వీరంగం చేశాడు. దీంతో అక్కడున్న ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. రాయచోటి పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ సమీపంలో వున్న పానిపురి బండి వద్ద పానిపూరి తినడానికి ఓ కుటుంబ సభ్యులు వచ్చారు. అక్కడే అడ్డంగా నిలబడిన వ్యక్తి సైకో అని తెలియక కాస్త పక్కకు జరుగు అని ఆ కుటుంబ సభ్యులు అన్నారు. వెంటనే సైకో తన దగ్గర వున్న కత్తులను బయటకు తీసి వారిపై దాడికి యత్నించాడు.

బయబ్రంతులకు గురైన ఆ కుటుంబ సభ్యులు, పానిపురీ యజమాని,సమీపంలో వున్న ప్రజలు పరుగులు తీశారు. కాస్త పక్కకు జరుగు అన్నదానికే సైకో ఇంతటి వీరంగం చేశాడా అని అక్కడున్న వారంతా ప్రాణ భయంతో హడలెత్తారు. సైకో కు భయపడి పరిగెత్తుతున్న కుటుంబ సభ్యులలోని ఒక మహిళను ఆదేశమయంలో అటు వెళ్తున్న ఆటో డీ కొనింది. ఈ ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. ప్రక్కకు జరుగు అన్న వెంటనే సైకో కత్తులు తీయడం వెనుక వేరే ఎవర్నైనా చంపడానికి వెళ్తున్నాడా అంటూ ప్రజలలో పలు అనుమానాలు తలెత్తాయి. స్థానికుల సమాచారం మేరకు సకాలంలో పోలీసులు అక్కడికి చేరుకొని సైకోను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement