Monday, April 29, 2024

మళ్లీ జగన్ నే గెలిపిస్తామంటున్న జనం.. ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ, జులై 25 (ప్రభ న్యూస్): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అన్నకి ఓట్లు వేస్తామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఏడో డివిజన్ కొర్లగుంట నందు డివిజన్ అధ్యక్షులు చిమట రమేష్ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బుక్ లెట్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి ఓట్లు వేసి సంక్షేమ పథకాలను పోగొట్టుకునే స్థితిలో తాము లేమని ప్రజలు గడపగడపకు కార్యక్రమంలో స్పష్టంగా తెలియజేస్తున్నారని వివరించారు.

చంద్రబాబు నాయుడు మోసాలు గురించి ఎప్పుడో తెలిసిపోయిందని ప్రజలు చెబుతున్నారని వివరించారు. చంద్రబాబు కూటమికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నన్నారు. చంద్రబాబు నాయుడు కళ్ళ బొల్లి మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కనీసం ఆయన హయాంలో ఒక అంకణం స్థలం కూడా ఇవ్వలేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణాన్ని 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి తీర్చుకుంటామని అంటున్నారన్నారు. జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు తమ అన్దనమ్ములు కూడా తమకు చేయలేదంటూ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, ముని రామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు రుద్రరాజు శ్రీదేవి, వైఎస్ఆర్సిపి నాయకులు ఆదం సుధాకర్ రెడ్డి, బుసగాని లక్ష్మయ్య యాదవ్, పాముల రమేష్ రెడ్డి, శ్రీనివాసులు, అక్కినపల్లి లక్ష్మయ్య, తాళ్లూరు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement