Monday, April 29, 2024

త్వరలో 52 కోట్లతో కొత్త మూసారాం బాగ్ బ్రిడ్జి నిర్మాణం – ఎమ్మెల్యే కాలేరు

హైదరాబాద్ – గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా మూసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ .,. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం, మూసి నదిలో ఉదృతంగా నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో, మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు, వర్షం నేపథ్యంలో అక్కడ ప్రయాణించే వారికి తగిన జాగ్రత్తలు సూచిస్తూ ప్రజలకు అండగా నిలవాలని ట్రాఫిక్ పోలీస్ వారికి ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గౌరవ సీఎం కేసీఆర్ , మంత్రి వర్యులు కేటీఆర్ ఇక్కడి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి ఆదేశాలు జారీ చేశారని, 52 కోట్ల రూపాయల నిధులతో నూతన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన కూడా జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ , ట్రాఫిక్ ఏసీపీ శరత్ కుమార్ , సీఐ కిషన్ గారు ఇతర అధికారులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement