Sunday, May 5, 2024

ఆటో కార్మికులకు అండగా జగనన్న ప్రభుత్వం : ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : ఆటో కార్మికులకు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. వాహనమిత్ర నాల్గవ విడత లబ్ధిదారులకు ఆన్ లైన్ ద్వారా వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తున్న సందర్భంగా… స్థానిక శిల్పారామం వద్ద నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు శుక్రవారం ఉదయం తలపెట్టిన ఆటోల ర్యాలీని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. వాహనమిత్ర పథకం ద్వారా ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులు, డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. ముఖ్యంగా వాహనాల ఇన్సూరెన్స్, రిపేర్ ఖర్చులకు దోహద పడాలన్నదే జగనన్న ఆకాంక్ష అని భూమన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్టీవో సీతారామిరెడ్డి, గూడూరు ఇంచార్జ్ ఆర్టీవో మురళీ మోహన్, ఎంవీఐ మురళి, కుసుమ, శేషాద్రి, ఏఎంవీఐ తిమ్మరుసు నాయుడు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement