Wednesday, May 15, 2024

ప్రజల మద్దతుతో మళ్లీ జగనన్న అధికారంలోకి : ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి సిటీ : ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.. సోమవారం గడప గడపకు కార్యక్రమం భాగంగా ఇందిరా నగర్ లోఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ విస్తృతంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల్లో ఆదరణా భిమానాలు చెక్కు చెదరలేదని అన్నారు. మళ్లీ మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రి గా చూడాలన్నదేశ ప్రజల ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. . తిరుపతి సహా రాష్ట్రంలో ఎక్కడైనా గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికి జగనన్న ఆర్థిక సహాయం పెద్ద ఎత్తున అందు తోందంటూ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా తమను ఆప్యాయంగా పలుకరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ తమను సాదరంగా స్వాగతిస్తున్నారని తెలిపారు. అయితే తమను ప్రజలు నిలదీస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కొన్ని పత్రికలు, ప్రచార సాధనాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. గిట్టని వారు ఎన్నిరకలుగా ప్రచారం చేసినా, ప్రజల మద్దతుతో మళ్లీ అధికారంలోకి వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ లు భూమన్అభినయ రెడ్డి.ముద్ర నారాయణ .. కార్పొరేటర్లు హనుమంతు నాయక్. రామస్వామి వెంకటేశ్వర్లు.ఎస్ కె బాబు. కో ఆప్షన్ సభ్యులు శ్రీదేవి.. పార్టీ నాయకులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement