Friday, May 10, 2024

ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలి : జేపీ నడ్డా

రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకే మనం ఉన్నామని.. ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. విజయవాడలో నిర్వహించిన శక్తి కేంద్రాల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతమిదని అన్నారు. మార్పు కోసం మనం ప్రతి ఇంటి తలుపు తట్టాలన్నారు. ఏపీలో పదివేలకు పైగా శక్తి కేంద్రాలున్నాయన్నారు. ప్రతి శక్తి కేంద్రంలోకి ఐదారు పోలింగ్ బూత్ లు వస్తాయన్నారు. ప్రతి బూత్ కమిటీలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ నెలలో పూర్తి కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement