Friday, April 26, 2024

మరో 30 ఏళ్లు జగనన్న ప్రభుత్వమే : ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి సిటీ : రాష్ట్రంలో మరో 30 ఏళ్ళ పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. . శనివారం గడపగడపకు ఈ కార్యక్రమంలో భాగంగా కొర్లగుంట జీవకోన ప్రాంతాల్లో ఇంటింటికి ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఉద్ఘాటించారు. ప్రజల జీవితాల్లో సంక్షేమ పథకాలు వెలుగులు నింపుతున్నాయన్నారు. తిరుపతిలో గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కి 89 వేల మంది ఓట్లు వేస్తే, ఈ మూడేళ్ళలోనే 2 లక్షల 20 వేల మందికి 1600 కోట్ల రూపాయల మేరకు లబ్ది చేకూర్చినట్టు వెల్లడించారు. దీంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ సీపీ కి ఓట్లు వేసి, విజయం చేకూరుస్తామని ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని భూమన వివరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మూడేళ్ల పాలనలో చేపట్టిన సామాజిక ఆర్థిక హిత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వాటి లక్ష్యాల గురించి ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని కార్యకర్తలుగా తమకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుపతిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement