Tuesday, April 30, 2024

ప‌ది ప‌రీక్ష ఫ‌లితాలు వాయిదా

ఏపీలో ప‌ది ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వాయిదా ప‌డ్డాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల శనివారం (4-6-2022) ఉదయం 11 గంటలకు విడుదల చేయాల్సిన పదవ తరగతి ఫలితాలు విడుదల చేసే కార్యక్రమాన్ని సోమవారానికి వాయిదా వేసిన‌ట్లు ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ ప్రకటించారు. మీడియా ప్రతినిధులు, తల్లిదండ్రులు గమనించాల‌న్నారు. సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా ఫలితాలు వాయిదా వేసినట్లు వెల్లడించారు. సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ప‌ది ప‌రీక్ష ఫ‌లితాలు వాయిదా ప‌డిన‌ట్లు గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ డి.దేవానంద్ రెడ్డి కూడా ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement