Tuesday, May 7, 2024

నవరత్నాలతో ప్రతి గడపలో సంతోషం.. ఎమ్మెల్యే భూమన

తిరుపతి సిటీ : సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలతో ప్రతి గడపలో సంతోషం వ్యక్తమ‌వుతోంద‌ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిమ్మినాయుడుపాలెం హరిజనవాడలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 50వ తిమ్మినాయుడుపాలెంలో కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏమ్మా.. సంక్షేమ పథకాలు సక్కంగా అందుతున్నాయా.. సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అంటూ ప్రజలతో మమేకమై ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి కుటుంబానికి మూడేళ్లలో రూ.. లక్షల్లో లబ్ధి చేకూరిందని చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని పాలనతో పారదర్శకత మిగిలిన సమస్యలను పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. తిమ్మనాయుడుపాలెం హరిజనవాళ్ళ గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష స‌హ‌ బంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు భోకం అనిల్ కుమార్, రామస్వామి, వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement