Thursday, May 16, 2024

స్మశానంలో పశువుల గడ్డి పెంపకం

కార్వేటి నగరం మండలం, ఆర్ కె వి బి పేట గ్రామ పంచాయతీ, ఆర్ కె వి బి పేట గ్రామానికి కేటాయించిన స్మశానం భూమిని ఆక్రమించి అందులో పశువుల దానా పెంచుకుంటూన్నారని జనసేన నియోజకవర్గం ఇంచార్జి యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ అస్తులను, డి కె టి భూములను, స్మశానం భూములను కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉన్నదని తెలియ జేశారు. స్థానిక తహసీల్దార్ వెంటనే స్మశానం భూమిని పరిశీలించి సంబంధిత ఆక్రమణదారుని తొలగించాలని తెలిపారు. అధికారులు మండలం లోని స్మశానం భూములను సర్వే చేసి చుట్టూ ప్లాంటేషన్ చేసి కానుగ మొక్కలను పెంచి కాపాడాలని తెలిపారు. గ్రామ సామజిక ఆస్తుల వద్ద సూచిక బోర్డు లను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్బంగా తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల కోఆర్డినేటర్ రాఘవ, నాయకులు శివ, జస్వంత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement